జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Tuesday, September 28, 2010

ప్రేక్షకులకు 'ఖలేజా' పాటల ప్రసాదం

త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేశ్ ల కాంబినేషన్ లో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఖలేజా' చిత్రం విడుదలకు మరో అడుగు ముందుకేసింది. సినిమా పాటలు నిన్నే రేడియో మిర్చీ స్టేషన్ ద్వారా విడుదలయ్యాయి. ఈ సినిమా రీరికార్డింగ్ పనితో తలకు మించిన భారంలో ఉన్నప్పటికీ, ఈ ఆడియో విడుదల కార్యక్రమం కోసం సంగీత దర్శకుడు మణిశర్మ మద్రాసు నుంచి హైదరాబాద్ కు హడావిడిగా వెళ్ళడం ఓ విశేషం.

హేమచంద్ర, కారుణ్య తదితరులు ఈ సినిమా కోసం పాడారు. అన్నట్లు మహేశ్ బాబు ట్యాక్సీ డ్రైవర్ గా నటిస్తున్న సినిమాలో, "ట్యాక్సీ ట్యాక్సీ..." అంటూ ఏకంగా ఓ పాటే పెట్టేశారు. అయితే, అది అన్ని సినిమాల్లో లాగా హీరో గుణకీర్తిని భజించే ఇంట్రడక్షన్ సాంగ్ కాదని చిత్రనిర్మాణ వర్గాలు చెప్పాయి.

ఇంకా ఇదే సినిమాలో, 'ఓం నమో శివ రుద్రాయ...' అంటూ సందర్భోచితంగా సాగే, ఓ భక్తి గీతం కూడా ఉండడం విచిత్రం. కాగా, 'పిలిచే పెదవులపైన....' అంటూ శ్రావ్యంగా సాగిన యుగళ గీతం కత్తి మీద సాము అనిపిస్తుంది. 'ఈ ఆల్బమ్ లోకెల్లా ఎంతో కష్టపడి చేసినది ఈ మెలోడీ సాంగే'నని మణిశర్మ చెప్పారు. ఏతావతా, సినిమాలోని ఆరు పాటల సీడీ ఇప్పుడు మార్కెట్లోకి వచ్చింది. విని, ఆనందిద్దాం.

0 వ్యాఖ్యలు: