జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Tuesday, February 12, 2013

'రేడియో తరంగ'లో తెలుగు సినిమా పుట్టిన రోజు…ఇంటర్వ్యూ











హైదరాబాద్ నుంచి నడుస్తున్న ఇంటర్ నెట్ రేడియో అయిన 'రేడియో తరంగ' (http://telugu.tharangamedia.com) వారు తెలుగు సినిమా 82వ జన్మదినం సందర్భంగా ఓ ప్రత్యేక కార్యక్రమం ప్రసారం చేశారు. ప్రింట్, రేడియో, టీవీ జర్నలిజాల్లో విశేష అనుభవమున్న సీనియర్ జర్నలిస్టు తుర్లపాటి నాగభూషణరావు గారు ఉన్నట్టుండి ఫోన్ చేసి, భక్త ప్రహ్లాద విశేషాలను శ్రోతలతో పంచుకోవాలని కోరారు. హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి, అప్పటికప్పుడు ప్రత్యక్ష ప్రసారంలో నాతో ఇంటర్వ్యూ చేయడం ఓ థ్రిల్లే. అప్పటికప్పుడు ఆ పది నిమిషాల్లో చెప్పిన సంగతులు, తెలుగు గడ్డ మీది తొలి పర్మినెంట్ సినిమా థియేటర్ అయిన విజయవాడ మారుతీ సినిమా హాలు (స్థాపితం 1921) విశేషాలు, భక్త ప్రహ్లాద కూడా అక్కడ విడుదల కావడం లాంటివన్నీ ఈ ఇంటర్వ్యూలో వచ్చాయి.

ప్రముఖ సినీ నటుడు గుండు హనుమంతరావుతో కూడా ఆ కార్యక్రమంలో మాట్లాడించారు. ఆ ఇంటర్వ్యూ మొత్తాన్నీ, చిన్న వార్తతో సహా రేడియో తరంగ వెబ్ సైట్ లో పోస్ట్ చేసినట్లు తుర్లపాటి నాగభూషణరావు గారు ఇవాళే చెప్పారు. ఆసక్తి గల సినీ, రేడియో ప్రియుల కోసం వారి పోస్ట్ నూ, ఆ ఆడియో క్లిప్ నూ ఇక్కడ అందిస్తున్నా. విని ఆనందించండి... ఆశీర్వదించండి....


 తెలుగు సినిమా పుట్టిన రోజు


తెలుగు సినిమా పుట్టినరోజు సందర్భంగా 1932 ఫిబ్రవరి 6న విడుదలైన పూర్తి నిడివిగల తెలుగు టాకీ చిత్రం భక్తప్రహ్లాద. ఈ చిత్రం విడుదల సంవత్సరం, తేదీ విషయంలో ముసురుకున్న అనుమానాలను సినీ పరిశోధకలు రెంటాల జయదేవ (మద్రాసు)గారు వివరణ ఇచ్చారు. విజయవాడ శ్రీ మారుతీ సినిమాహాలులో ఈ చిత్రం అప్పట్లో ఆడింది. ఆ సినిమాహాలుకీ ఓ ఘన చరిత్ర ఉంది. అలాగే సురభి నాటక సమాజంతో కూడా ఈ సినిమాకు అనుబంధం ఉంది. 2013 ఫిబ్రవరి ఆరున రేడియో తరంగాలో నాగ్ తుర్లపాటి నేతృత్వంలో  ప్రసారమైన ఫోకస్ షోలో రెంటాల జయదేవ, హాస్యనటులు గుండు హనుమంతరావుగారి జ్ఞాపకాలు వినండి.


ఫోకస్, వ్యూస్ అండ్ న్యూస్ అనే ఆ ప్రత్యేక కార్యక్రమం వినడానికి ఇక్కడ ఈ లింకు నొక్కండి...





Saturday, February 9, 2013

తెలుగు సినిమా 82వ పుట్టినరోజు - హన్స్ ఇండియా లో....





 నా పరిశోధనకు మరింతమంది నుంచి గుర్తింపు లభిస్తోంది. ప్రచారంలో ఉన్న చరిత్రను మార్చేస్తూ, తెలుగు సినిమా పుట్టిన రోజుకు సంబంధించి నేను చేసిన పరిశోధనకు తాజాగా మరింత మద్దతు వచ్చింది. తొలి పూర్తి తెలుగు టాకీ, భక్త ప్రహ్లాద విడుదల తేదీ 1931 సెప్టెంబర్ 15 కాదు, వాస్తవంగా అది రిలీజైంది 1932 ఫిబ్రవరి 6న అంటూ ససాక్ష్యంగా నేను నిరూపించిన తీరునూ, వాదననూ ప్రముఖ తెలుగు దినపత్రికలు సాక్షి, ఆంధ్రజ్యోతి సమర్థించాయి. మొన్న ఫిబ్రవరి 6తో తెలుగు సినిమాకు 81 ఏళ్ళు నిండి, 82వ ఏడు వచ్చిందని ప్రచురించాయి. ఆంగ్ల దినపత్రిక ది హన్స్ ఇండియా సైతం నా పరిశోధనను ప్రామాణీకరిస్తూ (7 ఫిబ్రవరి 2013, గురువారం నాటి పత్రికలో) వార్తా కథనం వేసింది. ఆ ఆంగ్ల కథనం తాలూకు లింకు, సమాచారం ఈ దిగువన మీ కోసం....

Telugu Cinema turns a grand 82!

The Telugu film industry turned 82 on Wednesday. The day commemorates the release of first Telugu feature film ‘Bhakta Prahlada’. Ending years of quandary over the release date of first Telugu talkie feature film ‘Bhakta Prahlada’, noted film journalist, researcher and Nandi award winning critic Rentala Jayadeva has proved the exact date by providing appropriate evidences.

Earlier,
September 15, 1931, was considered as the release date of the film by many that was later disproved by Jayadeva making it a way for the fact that it was released on February 6, 1932. Directed by doyen HM Reddy, the movie was made in 18 days with a budget of Rs 18,000 and it was censored on January 22, 1932, in Mumbai (then Bombay) which released on February 6 in Krishna Theatre in Bombay. 


The film was moved to Sri Maruti theatre in
Vijayawada and Sri Krishna theatre in Rajahmundry after having two-week successful run in Bombay. 

Starring Krishna Rao, Munipalle Subbaiah, Surabhi Kamala Bhai and Sindhoori Krishna Rao in significant roles, veteran director-producer LV Prasad was seen as a dimwit in the film. The movie was later released in
Madras on April 2, 1932, and received well by audiences.

(Published in ‘The Hans India’ daily dated 7th February 2013, Thursday, Page 10)

Wednesday, February 6, 2013

తెలుగు సినిమా 82వ పుట్టినరోజు


భక్త ప్రహ్లాదమన తొలి సినిమా. తెలుగు సినిమా వృక్షానికి విత్తనం వేసిన సినిమా. భక్త ప్రహ్లాదవిడుదలై నేటికి 81 ఏళ్లు నిండి, 82లోకి ఎంటరవుతోంది. నిన్న మొన్నటి వరకూ ఈ సినిమా విడుదల విషయంలో ఓ సందిగ్ధావస్థ ఉంది. దాదాపుగా అంతా 1931 సెప్టెంబరు 15నే తెలుగు సినిమా పుట్టిన్రోజుగా పరిగణించేవారు. సీనియర్ పాత్రికేయుడు, సినీ పరిశోధకుడు రెంటాల జయదేవ ఎంతో పరిశోధన జరిపి భక్త ప్రహ్లాద’ 1932 ఫిబ్రవరి 6న విడుదలైందని కొన్ని ఆధారాల ద్వారా నిరూపించారు. హెచ్.ఎం.రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. 


18
వేల రూపాయల పెట్టుబడితో 18 రోజుల్లో సినిమా నిర్మాణం పూర్తి చేశారు. 9,762 అడుగుల నిడివిగల 10 రీళ్ల ఈ చిత్రం 1932 జనవరి 22న బొంబాయిలో సెన్సారింగ్ జరుపుకుంది. ఈ సినిమాను మొదట బొంబాయిలోని కృష్ణా సినిమా థియేటర్‌లో ఫిబ్రవరి 6న విడుదల చేశారు. బొంబాయిలో రెండు వారాలు ఆడిన తర్వాత విజయవాడ (శ్రీ మారుతి సినిమాహాలు), రాజమండ్రి (శ్రీకృష్ణా సినిమాహాలు)ల్లో విడుదలైంది. అటుపై మద్రాసులో ఏప్రిల్ 2న విడుదలైనపుడు మాత్రం బాగా హంగామా చేశారు. నాటకాలకు బాగా అలవాటు పడిన అప్పటి ప్రేక్షకులకు తెరమీద బొమ్మలు కదలడమే ఓ వింత అనుకుంటే, ఈ బొమ్మలు మాట్లాడ్డం మరో విడ్డూరంగా అనిపించింది. 

ఈ సినిమా నిర్మాణం కోసం హెచ్.ఎం.రెడ్డి ఎంతో ప్రయాసపడ్డారు. సురభి నాటక కంపెనీవారితోనే ఇందులో ఎక్కువ వేషాలు వేయించారు. మునిపల్లె సుబ్బయ్య, సురభి కమలాభాయి, సింధూరి కృష్ణారావు తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఎల్వీప్రసాద్ మొద్దబ్బాయిగా నటించారు. టైటిల్ రోల్ చేసిన కృష్ణారావునే మన తొలి తెలుగు కథానాయకునిగా చెప్పుకోవాలి. 

కృష్ణా ఫిలింస్ పతాకంపై తయారైన ఈ సినిమాకి హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రి సంగీతం అందించగా, చందాల కేశవదాసు సాహిత్యం సమకూర్చారు. భక్త ప్రహ్లాదప్రేక్షకాదరణ చూసి చాలామంది చిత్ర నిర్మాణం వైపు మొగ్గు చూపారు. మన  దురదృష్టమో, అశ్రద్ధో ఈ సినిమా చూద్దామంటే ప్రింట్ కూడా అలభ్యం. ఒకటి, రెండు స్టిల్స్, పోస్టర్లే మనకు మిగిలిన జ్ఞాపకాలు. సినిమాను ప్రేమించే ప్రతి ఒక్కరూ భక్త ప్రహ్లాదను ఒక్కసారైనా స్మరించుకోవాల్సిందే.

 

(6 ఫిబ్రవరి 2013, బుధవారం నాటి సాక్షి దినపత్రిక, సినిమా పేజీలో ప్రచురితం)

తొలి పూర్తి తెలుగు సినిమా 'భక్త ప్రహ్లాద'కు 81 ఏళ్లు నిండాయోచ్...




















టాకీల ఆవిర్భావంతో సినిమా ఎవరూ ఊహించనంత మార్పులకు లోనయింది. ఆంగ్లో ఇండియన్లు, 'మూకీ మహారాజులు'గా వెలుగొందిన ఎంతోమంది టాకీల రాకతో క్రమేపీ తమ ప్రాభవాన్నీ, ప్రతిష్టనూ కోల్పోయారు. అప్పటివరకూ భాషాబేధాలు లేకుండా అందరినీ సమానంగా అలరించిన సినిమా ప్రేక్షకుల మ«ధ్య కొత్త గోడల్ని ఏర్పరచింది. దీని ప్రభావం వల్ల ఎవరికి వారు తమ భాషలోనే చలనచిత్రాలు ఉండాలన్న కోరికను వ్యక్తం చేయసాగారు. మిగిలిన వారి సంగతి అలా ఉంచితే మనదేశంలో టాకీల నిర్మాణం ప్రారంభం కాగానే తెలుగులో కూడా టాకీ చిత్రం రావాలనీ, భారతీయచలనచిత్ర చరిత్రలో తెలుగు సినిమాకు సముచిత స్థానం లభించాలనీ కలలు కన్న జి.మంగరాజు వాటిని సాకారం చేసుకోవడానికి విశేషంగా కృషి చేశారు. ముంబాయిలో ఉండే మాణిక్యాలాల్ శేఠ్‌తో పరిచయం ఏర్పడటంతో ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపి తెలుగులో టాకీ నిర్మాణానికి ముందడుగు వేసేలా చేశారు. 

అలా హెచ్.ఎం.రెడ్డి దర్శకత్వంలో తయారైన తొలి తెలుగు టాకీ 81 ఏళ్ల క్రితం 1932 ఫిబ్రవరి 6న విడుదలైంది. భారతీయ తొలి టాకీ 'ఆలంఆరా' విడుదలైన ఆరు నెలలకు అంటే 1931 సెప్టెంబర్ 15'భక్త ప్రహ్లాద' చిత్రం విడుదలైన మాట వాస్తవం కాదనీ, 1932 జనవరి 22న సెన్సార్ పూర్తి చేసుకుని ఫిబ్రవరి 6న ఈ సినిమా విడుదలైందని ఆధారాలతో సహా పాత్రికేయుడు రెంటాల జయదేవ 'ఆంధ్రజ్యోతి' ద్వారా వెల్లడించిన సంగతి చాలా మందికి గుర్తుండే ఉంటుంది. మరో విషయం ఏమిటంటే ఈ సినిమా తొలిసారిగా విడుదలైంది అప్పటికి అం«ద్రులు పెద్ద సంఖ్యలో ఉన్న ముంబాయిలో. సెన్సారైన మరుసటి వారమే "తెలుగులో మాటలు, పాటలున్న భారత్ మూవీటోన్ వారి భక్తరస చిత్రం 'భక్తప్రహ్లాద్' త్వరలో విడుదల'' అనే ప్రకటన 1932 జనవరి 31 'ది బాంబే క్రానికల్'లో వచ్చింది. ఆ ప్రకటన వచ్చిన వారంలోపలే ముంబయిలోని న్యూ ఛార్నీ రోడ్డులో ఉన్న కృష్ణా సినిమాలో తొలిసారిగా 'భక్త ప్రహ్లాద' చిత్రం విడుదలైంది. ప్రీవ్యూ చూడటం వల్ల ఆ రోజుకి వచ్చేలా కొన్ని దినపత్రికలు సమీక్షలు రాశాయి. 1932 ఫిబ్రవరి 6'ది టైమ్స్ ఆఫ్ ఇండియా' దినపత్రికలో కూడా 'భక్త ప్రహ్లాద' రివ్యూ వచ్చింది.

జయదేవ పరిశోధనలో వెల్లడైన వివరాల ప్రకారం ఈ సినిమా చెన్నయ్‌లో విడుదల కావడానికి మరో రెండు నెలలు పట్టింది. తెలుగు ఉగాదికి నాలుగు రోజుల ముందు అంటే 1932 ఏప్రిల్ 2 శనివారం 'నేషనల్ పిక్చర్ ప్యాలెస్' (ఇప్పటి బాడ్వే టాకీస్)లో విడుదలై రెండు వారాలు ఆడింది. ముంబయి నుంచి, అప్పటి మన ఉమ్మడి మద్రాసు రాష్ట్ర రాజధాని చెన్నపట్నానికి వచ్చే లోపల 'భక్తప్రహ్లాద' ఇంకెక్కడెక్కడ ఆడిందో ఆధారాలు లేవు కానీ 'రాజమహేంద్రవరము నందు వరుసగా మూడు వారముల వరకూ ప్రజలనాకర్షించెను... (ఆంధ్రపత్రిక దినపత్రిక 1932 ఏప్రిల్ 2, పేజీ 14) అనే వాక్యం ఒక్కటే మనకు తెలుసు. ఆ ఒక్క వాక్యం మినహా, తెలుగు నేలపై ఏయే ప్రాంతాల్లో , ఏయే తేదీల్లో ఈ తొలి తెలుగు టాకీ ప్రదర్శితమైందో తెలిపే సాక్ష్యాలు దురదృష్టవశాత్తూ ఇప్పటికీ లభించడంలేదు.

కాగా 'భక్తప్రహ్లాద' 1932 ఫిబ్రవరి 6న విడుదలైందనే విషయాన్ని తెలుగు చిత్ర పరిశ్రమ ఇప్పటికీ అంగీకరించడం లేదు. సెప్టెంబర్ 15, 2011న జరిగిన '80 ఏళ్ల తెలుగు టాకీ' సభలో విడుదల తేదీ గురించి ఇంకా పరిశోధనలు జరగాలని మాత్రం సినీ ప్రముఖులు పేర్కొన్నారు.

(6 ఫిబ్రవరి 2013, బుధవారం నాటి ఆంధ్రజ్యోతి దినపత్రిక, సినిమా పేజీలో ప్రచురితం)


దేశభక్తిని రగిలించే పుస్తకాలు రావాలి - యువతకు ప్రేరణగా 'ఎ సెయిలర్స్ స్టోరీ'




అంబత్తూరు: నేటి పరిస్థితుల్లో దేశభక్తిని రగిలింపజేసే 'ఎ సెయిలర్స్ స్టోరీ' లాంటి పుస్తకాలు మరిన్ని రావాల్సిన ఆవశ్యకత వుందని వక్తలు అభిప్రాయపడ్డారు. సెయిం ట్ స్టోరీ పుస్తకం భావితరాలకు ఖచ్చితంగా మార్గదర్శకం కాగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత నావికాదళంలో అనితర సాధ్యమైన కృషి సల్పి దేశం కోసం పాటుపడిన దివంగత వైస్ అడ్మిరల్ నీలకంఠన్ కృష్ణన్ ఆత్మకథ 'ఏ సెయిలర్స్ స్టోరీ' పుస్తకావిష్కరణ కార్యక్రమం శనివారం రాజ్‌భవన్‌లోని అన్నపూర్ణ హాలులో జరిగింది. నీలకంఠన్ కృష్ణన్ తనయుడు అర్జున్ కృష్ణన్ పుస్తకానికి సంపాదకత్వ బాధ్యతలు నిర్వహించి తన తండ్రి మృతి చెందిన ముఫ్పై సంవత్సరాల తరువాత ప్రతిష్టాత్మకంగా ఈ పుస్తకాన్ని విడుదల చేయడం విశేషం. రాష్ట్ర గవర్నర్ రోశయ్య పుస్తకాన్ని ఆవిష్కరించగా, తొలి ప్రతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, సభాధ్యక్షులు కేవీ రమణాచారి అందుకున్నారు. 

ఈ సందర్భంగా రోశయ్య మాట్లాడుతూ.. నీలకంఠన్ కృష్ణన్ భారతావనికి దక్కిన రియల్ హీరో అని అభివర్ణించారు. జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ లాంటి ప్రముఖల హయాంలో కీలకమైన నావికాదళంలో విస్తృతమైన సేవలందించినందుకుగాను భారత ప్రభుత్వం ఆయనను ప్రతిష్టాత్మకంగా పద్మభూషణ్‌తో గౌరవించిందని పేర్కొన్నారు. యుద్ధసమయాల్లో కృష్ణన్ వ్యవహరించిన తీరు, సమయస్ఫూర్తి నేటి తరానికి, భావి తరాలకు ఆదర్శనీయమని కితాబిచ్చారు. అలాంటి సాహోసేపత వీరుడు తన ఆత్మకథను ముక్కుసూటిగా ప్రస్తావిస్తూనే మధ్య మధ్యలో తనలోని రచయితని తట్టిలేపిన విధానం చాలా బాగుందన్నారు.

ఆయన చనిపోయిన మూడు దశాబ్ధాల తరువాత ఆయన కుమారుడు పుస్తకాన్ని విడుదల చేయడం నిజంగా ప్రశంసనీయమన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, సాంస్కృతిక కౌన్సిల్ ఛైర్మన్ ఆర్వీ రమణమూర్తి మాట్లాడుతూ.. 'ఏ సెయిలర్స్ స్టోరీ' అద్భుతమైన పుస్తకమని పేర్కొన్నారు. ఈ పుస్తకం కచ్చితంగా భావితరాలకు ఆదర్శంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కృష్ణన్ సేవలను గుర్తు చేసుకొని భారతావని కోసం ఆయనలాగే శ్రమించే తత్వాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. పాత్రికేయుడు రెంటాల జయదేవ మాట్లాడుతూ.. ఏ సెయిలర్స్ స్టోరీ పుస్తకం ఆద్యంతం చదివించేలా వుందని కితాబిచ్చారు.

గత నాలుగు రోజులుగా భారత్-పాక్ సరిహద్దులో చోటుచేసుకుంటున్న సంఘటనల నేపథ్యంలో జాతిభక్తిని మేల్కోలిపే విధంగా ' సెయిలర్స్ స్టోరీ' లాంటి పుస్తకాలు మరిన్ని రావాల్సిన అవసరం వుందని అభిప్రాయపడ్డారు. సభకు అధ్యక్షత వహించిన కేవీ రమణాచారి మాట్లాడుతూ.. తమిళనాడు రాజ్‌భవన్‌లో తెలుగు పలుకులు విన్పిస్తుండడం చెవులకు ఇంపుగా వుందన్నారు. రాష్ట్ర గవర్నర్ రోశయ్య వల్లే ఇది సాధ్యపడిందని అభిప్రాయపడ్డారు. తమిళుడైన అర్జున్ కృష్ణన్, తెలుగు వారితోనూ సాన్నిహిత్యాన్ని కలిగి వున్న కారణంగా తమిళులు, తెలుగువారు ఏకమై ఆయన తండ్రి పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారని అన్నారు. 

భారత నావికాదళంలో కృష్ణన్ సేవలు అనిర్వచనీయమని ప్రశంసించారు. ఈ సందర్భంగా పుస్తక సంపాదకులు అర్జున్ కృష్ణన్ దంపతులను రోశయ్య దుశ్శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని సీనియర్ పాత్రికేయుడు భగీరథ నిర్వహించారు. కార్యక్రమంలో అఖిల భారత తెలుగు సమాఖ్య అధ్యక్షుడు డాక్టర్ సీఎంకే రెడ్డి, ఆస్కా అధ్యక్షుడు డాక్టర్ సుబ్బారెడ్డి, కెన్సెస్ అధినేత కె.నరసారెడ్డి, ఆస్కా సంయుక్త కార్యదర్శి కృష్ణ, ప్రముఖ ఆడిటర్ జేకే రెడ్డి, ఆర్యవైశ్య ప్రముఖుడు నారాయణ గుప్తా, సినీ నిర్మాతలు సి.కల్యాణ్, కాట్రగడ్డ ప్రసాద్ తదితరులు కూడా పాల్గొన్నారు.
అంబత్తూరు: నేటి పరిస్థితుల్లో దేశభక్తిని రగిలింపజేసే 'ఎ సెయిలర్స్ స్టోరీ' లాంటి పుస్తకాలు మరిన్ని రావాల్సిన ఆవశ్యకత వుందని వక్తలు అభిప్రాయపడ్డారు. సెయిం ట్ స్టోరీ పుస్తకం భావితరాలకు ఖచ్చితంగా మార్గదర్శకం కాగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత నావికాదళంలో అనితర సాధ్యమైన కృషి సల్పి దేశం కోసం పాటుపడిన దివంగత వైస్ అడ్మిరల్ నీలకంఠన్ కృష్ణన్ ఆత్మకథ 'ఏ సెయిలర్స్ స్టోరీ' పుస్తకావిష్కరణ కార్యక్రమం శనివారం రాజ్‌భవన్‌లోని అన్నపూర్ణ హాలులో జరిగింది. నీలకంఠన్ కృష్ణన్ తనయుడు అర్జున్ కృష్ణన్ పుస్తకానికి సంపాదకత్వ బాధ్యతలు నిర్వహించి తన తండ్రి మృతి చెందిన ముఫ్పై సంవత్సరాల తరువాత ప్రతిష్టాత్మకంగా ఈ పుస్తకాన్ని విడుదల చేయడం విశేషం. రాష్ట్ర గవర్నర్ రోశయ్య పుస్తకాన్ని ఆవిష్కరించగా, తొలి ప్రతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, సభాధ్యక్షులు కేవీ రమణాచారి అందుకున్నారు. 

ఈ సందర్భంగా రోశయ్య మాట్లాడుతూ.. నీలకంఠన్ కృష్ణన్ భారతావనికి దక్కిన రియల్ హీరో అని అభివర్ణించారు. జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ లాంటి ప్రముఖల హయాంలో కీలకమైన నావికాదళంలో విస్తృతమైన సేవలందించినందుకుగాను భారత ప్రభుత్వం ఆయనను ప్రతిష్టాత్మకంగా పద్మభూషణ్‌తో గౌరవించిందని పేర్కొన్నారు. యుద్ధసమయాల్లో కృష్ణన్ వ్యవహరించిన తీరు, సమయస్ఫూర్తి నేటి తరానికి, భావి తరాలకు ఆదర్శనీయమని కితాబిచ్చారు. అలాంటి సాహోసేపత వీరుడు తన ఆత్మకథను ముక్కుసూటిగా ప్రస్తావిస్తూనే మధ్య మధ్యలో తనలోని రచయితని తట్టిలేపిన విధానం చాలా బాగుందన్నారు.

ఆయన చనిపోయిన మూడు దశాబ్ధాల తరువాత ఆయన కుమారుడు పుస్తకాన్ని విడుదల చేయడం నిజంగా ప్రశంసనీయమన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, సాంస్కృతిక కౌన్సిల్ ఛైర్మన్ ఆర్వీ రమణమూర్తి మాట్లాడుతూ.. 'ఏ సెయిలర్స్ స్టోరీ' అద్భుతమైన పుస్తకమని పేర్కొన్నారు. ఈ పుస్తకం కచ్చితంగా భావితరాలకు ఆదర్శంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కృష్ణన్ సేవలను గుర్తు చేసుకొని భారతావని కోసం ఆయనలాగే శ్రమించే తత్వాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. పాత్రికేయుడు రెంటాల జయదేవ మాట్లాడుతూ.. ఏ సెయిలర్స్ స్టోరీ పుస్తకం ఆద్యంతం చదివించేలా వుందని కితాబిచ్చారు.

గత నాలుగు రోజులుగా భారత్-పాక్ సరిహద్దులో చోటుచేసుకుంటున్న సంఘటనల నేపథ్యంలో జాతిభక్తిని మేల్కోలిపే విధంగా ' సెయిలర్స్ స్టోరీ' లాంటి పుస్తకాలు మరిన్ని రావాల్సిన అవసరం వుందని అభిప్రాయపడ్డారు. సభకు అధ్యక్షత వహించిన కేవీ రమణాచారి మాట్లాడుతూ.. తమిళనాడు రాజ్‌భవన్‌లో తెలుగు పలుకులు విన్పిస్తుండడం చెవులకు ఇంపుగా వుందన్నారు. రాష్ట్ర గవర్నర్ రోశయ్య వల్లే ఇది సాధ్యపడిందని అభిప్రాయపడ్డారు. తమిళుడైన అర్జున్ కృష్ణన్, తెలుగు వారితోనూ సాన్నిహిత్యాన్ని కలిగి వున్న కారణంగా తమిళులు, తెలుగువారు ఏకమై ఆయన తండ్రి పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారని అన్నారు. 

భారత నావికాదళంలో కృష్ణన్ సేవలు అనిర్వచనీయమని ప్రశంసించారు. ఈ సందర్భంగా పుస్తక సంపాదకులు అర్జున్ కృష్ణన్ దంపతులను రోశయ్య దుశ్శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని సీనియర్ పాత్రికేయుడు భగీరథ నిర్వహించారు. కార్యక్రమంలో అఖిల భారత తెలుగు సమాఖ్య అధ్యక్షుడు డాక్టర్ సీఎంకే రెడ్డి, ఆస్కా అధ్యక్షుడు డాక్టర్ సుబ్బారెడ్డి, కెన్సెస్ అధినేత కె.నరసారెడ్డి, ఆస్కా సంయుక్త కార్యదర్శి కృష్ణ, ప్రముఖ ఆడిటర్ జేకే రెడ్డి, ఆర్యవైశ్య ప్రముఖుడు నారాయణ గుప్తా, సినీ నిర్మాతలు సి.కల్యాణ్, కాట్రగడ్డ ప్రసాద్ తదితరులు కూడా పాల్గొన్నారు.

(13 జనవరి 2013, ఆదివారం నాటి సాక్షి, ఆంధ్రజ్యోతి దినపత్రికల తమిళనాడు అనుబంధాల్లో ప్రచురితం)