జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Tuesday, October 16, 2012

వరించిన నంది అవార్డు - ఉత్తమ సినీ విమర్శకుడు రెంటాల జయదేవ




తెలుగు చలనచిత్రాలకు ఏటేటా ఇచ్చే నంది అవార్డులను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మొన్న ప్రకటించింది. 2011వ సంవత్సరానికి గాను ఈ అవార్డుల ప్రకటన జరిగింది. ఉత్తమ సినీ విమర్శకుడి అవార్డు నన్ను వరించింది. ఇరవై ఏళ్ళ పైగా నేను సాగిస్తున్న పత్రికా వ్యాసంగంలో ఇది ఓ చెప్పుకోదగ్గ మజిలీ.

ఈ నందుల్లో శ్రీరామరాజ్యం, దూకుడు చిత్రాలకు ఏడేసి అవార్డులు లభించాయి. మహేశ్ బాబు ఉత్తమ నటుడు (దూకుడు చిత్రం)గా, నయనతార ఉత్తమ నటి (శ్రీరామరాజ్యం చిత్రం)గా, ఎన్. శంకర్ ఉత్తమ దర్శకుడు (జై బోలో తెలంగాణ చిత్రం)గా ఎంపికయ్యారు. మొత్తం నంది అవార్డుల పూర్తి వివరాలను పక్కనే ఇచ్చిన జాబితాలో (సౌజన్యం - ఆంధ్రజ్యోతి దినపత్రిక, 13 అక్టోబర్ 2012, ఆదివారం) చూడవచ్చు.


3 వ్యాఖ్యలు:

Kalasagar said...

Congrats Sir...
Kalasagar
Editor
64kalalu.com

కొండముది సాయికిరణ్ కుమార్ said...

అభినందనలు జయదేవ్ గారు.

Unknown said...

@ Kala Sagar, Kondamudi Saikiran Kumar. Thank you so much. Wish You happy deepavali.