జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Thursday, July 11, 2013

‘పద్మభూషణ్‌’ నూకల కన్నుమూత - దిగ్భ్రాంతి చెందిన కర్ణాటక సంగీత లోకం



‘పద్మభూషణ్‌’ (2010) పురస్కార0 
సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసుడు ‘పద్మభూషణ్‌’ నూకల చిన సత్యనారాయణ కన్నుమూశారు. జూలై 11వ తేదీ గ్నురువారం నాడు ూదయం సికింద్రాబాద్‌లోని పద్మారావు నగ్నర్‌లోని తన స్వగ్నృహంలో ఆయన శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. కర్ణాటక సంగీత శిక్షణతో ఎందరో శిష్యులను తీర్చిదిద్దిన ఈ ‘మహామహోపాధ్యాయు’ని వయస్సు 86 సంవత్సరాలు. ఆయన ఆకస్మిక మరణవార్తతో సంగీత, కళా ప్రియులు దిగ్భ్రాంతి చెందారు. సినీ రచయిత, నటుడు తనికెళ్ళ భరణితో సహా పలువురు సంగీత విద్వాంసులు, శిష్యులు, కళా ప్రియులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.

చిన్ననాటి నుంచే సంగీతాభిరుచి

బహుముఖ ప్రజ్ఞావంతులైన డాక్టర్‌ నూకల అటు కర్ణాటక సంగీత గాయకుడిగా, ూత్తమమైన ూపాధ్యాయుడిగా, సరళమైనరీతిలో సోదాహరణ ప్రసంగాలు ఇచ్చే నిపుణుడిగా అందరినీ అలరించారు. సంగీతంపై ఎన్నో అమూల్యమైన గ్న్రంథాలను వెలువరించారు.  1927 ఆగ్నస్టు 4న అనకాపల్లిలో ఆయన జన్మించారు. శ్రీమతి యజ్ఞచయనమ్మ, అన్నపూర్ణేశ్వర శర్మలు ఆయన తల్లితండ్రులు. తల్లి ప్రోత్సాహంతో, ఆమె దగ్న్గర ప్రాథమిక శిక్షణతో ఆయన తన సంగీత ప్రతిభకు పదును పెట్టుకున్నారు. సంగీతం పట్ల తన తరగ్నని అనురాగానికి తల్లే కారణమని ఆయన చెబుతూ ూండేవారు.


తొలి రోజుల్లో వయొలిన్‌ విద్యార్థిగా మొదలైన నూకల చిన సత్యనారాయణ అనంతరం విజయవాడలో మంగ్నళంపల్లి పట్టాభిరామయ్య (బాలమురళీకృష్ణ తండ్రి) వద్ద మూడేళ్ళు శిష్యరికం చేశారు. ఆ పైన విజయనగ్నరం వెళ్ళి ద్వారం వెంకటస్వామి నాయుడు వద్ద వయొలిన్‌ విద్యలో మరిన్ని మెలకువలు నేర్చుకున్నారు. దేశం నలుమూలలా ద్వారం వారితో కలసి కచ్చేరీలలో పాల్గొన్నారు. కర్ణాటక సంగీత పారంగ్నతులైన డాక్టర్‌ శ్రీపాద పినాకపాణికి నూకలను పరిచయం చేసింది ద్వారం వారే! అక్కడ నుంచి నూకల చిన సత్యనారాయణ సంగీత జీవితం మరో పెద్ద మలుపు తిరిగింది.

దశాబ్దాలుగా సంగీత సేవ


పినాకపాణి శిష్యరికంలో నూకల తన విశ్లేషణాత్మక దృక్పథానికి మరింత పదును పెట్టుకున్నారు. సంగీత కళనూ, అందులోని శాస్త్రాన్నీ లోతుగా పట్టుకున్నారు. తనదైన సొంత బాణీకి మెరుగ్నులు దిద్దుకున్నారు. ప్రతి స్వరంలో, పదంలో రాగ్న భావాన్ని జొప్పించి పాడడం మొదలుపెట్టారు. అలా ఆ కౌమార వయస్సు నుంచి నిన్నటి వరకు ఎన్నో దశాబ్దాల పాటు ఆయన సంగీత సేవకే కట్టుబడి ూండడం విశేషం. స్వయంగా పాడుతూనో, శిష్యులకు సంగీతం బోధిస్తూనో, సంగీతంపై గ్న్రంథాలు రాస్తూనో, సంగీత విద్యా బోధనలో సరికొత్త పద్ధతులను కనిపెడుతూనో, కర్ణాటక సంగీత వ్యాప్తికి కృషి చేస్తూనో జీవితమంతా గ్నడిపారాయన.


సంగీత గ్నురువుగా అందరి మన్ననలు పొందిన నూకల సికింద్రాబాద్‌ ` హైదరాబాద్‌ ` విజయవాడ ` తిరుపతిల్లోని ప్రభుత్వ సంగీత కళాశాలల్లో ప్రిన్సిపాల్‌గా, విజయనగ్నరంలోని మహారాజా సంగీత కళాశాలలో, హైదరాబాద్‌లోని తెలుగ్ను విశ్వవిద్యాలయంలో సంగీత ప్రొఫెసర్‌గా సేవలందించారు. అలాగే, ఆంధ్ర ` శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయాల్లో సంగీత శిక్షణకు సంబంధించి బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ చైర్మన్‌గా వ్యవహరించారు. ఆకాశవాణి కేంద్రంలోని సంగీత ఆడిషన్‌ బోర్డు, కమిటీలో సభ్యులైన ఆయన ప్రతిష్ఠాత్మక మద్రాస్‌ మ్యూజిక్‌ అకాడమీ ఎక్స్‌పర్ట్‌ మెంబర్‌గా నిలిచారు.

విశిష్ట గౌరవాలు

ఈ మహామహోపాధ్యాయుని సంగీత పాఠాలు ఇప్పటికీ ఆకాశవాణి, దూరదర్శన్‌ల ద్వారా మార్గదర్శనం చేస్తున్నాయి. భారత ప్రభుత్వం నుంచి ఎమెరిటస్‌ ఫెలోషిప్‌ అందుకున్న నూకల ప్రతిష్ఠాత్మకమైన సంగీత నాటక అకాడమీ అవార్డును అందుకున్నారు. పలు సాంస్కృతిక సంస్థలు ఆయనకు ‘గానకళా గ్నంధర్వ’, ‘సంగీత సార్వభౌమ’, ‘నాద సుధార్ణవ’, ‘అన్నమాచార్య విద్వన్మణి’ తదితర బిరుదులిచ్చి, గౌరవించాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు ‘హంస’ అవార్డునిచ్చింది. కర్ణాటక సంగీత రంగానికి నూకల చేసిన విశిష్ట సేవలకు గ్నుర్తింపుగా భారత ప్రభుత్వం  ఆయనకు ‘పద్మభూషణ్‌’ (2010) పురస్కారాన్నిచ్చి, సత్కరించింది.


తిరుమల తిరుపతి దేవస్థానం, కంచి, శృంగేరి, పుష్పగిరి పీఠాలకు ‘ఆస్థాన విద్వాంసుడి’గా నూకల గౌరవం పొందారు. సర్వేపల్లి రాధాకృష్ణన్‌, వి.వి. గిరి, జవహర్‌లాల్‌ నెహ్రూ, పి.వి. నరసింహారావు లాంటి దేశ నాయకుల ముందు సంగీత పాండిత్యాన్ని ప్రదర్శించిన నూకల చిన సత్యనారాయణ దేశ విదేశాల్లో అసంఖ్యాకంగా కచ్చేరీలు ఇచ్చారు. వందలాది శిష్యులను సంపాదించుకున్నారు. ‘‘సాధారణ జీవితం, అసాధారణ ఆలోచనా విధానమే జీవన సూత్రం’’గా చేసుకున్నట్లు స్వయంగా చెప్పుకున్న ఆయన ‘ది మోనోగ్రాఫ్‌ ఆఫ్‌ త్యాగ్నరాజాస్‌ పంచరత్న కృతీస్‌’, ‘రాగ్నలక్షణ సంగ్న్రహం’, ‘సంగీత సుధ’, ‘శ్రీత్యాగ్నరాజ సారస్వత సర్వస్వం’ తదితర రచనలు చేశారు.

నూకల వారికి అపారమైన శిష్యవాత్సల్యం. ఆయన, ఆయన భార్య శ్రీమతి శేష ఆతిథ్యానికి పెట్టింది పేరు. దాంతో, వారి నివాసం నిత్యం అతిథులు, విద్యార్థులు, సందర్శకులతో కళకళలాడుతూ ూంటుంది. ఆ దంపతులకు ముగ్న్గురు కుమార్తెలు, నలుగ్నురు కుమారులు ూన్నారు. పెద్ద కుమారుడు సికింద్రాబాద్‌లో నివసిస్తుండగా, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె విదేశాల్లో ూన్నారు. కుటుంబ సభ్యులు స్వదేశానికి చేరుకున్న తరువాత జూలై 13వ తేదీ శనివారం నాడు చిన సత్యనారాయణ భౌతిక కాయానికి అంత్యక్రియలు జరగ్ననున్నాయి.

‘‘ఎప్పుడూ వాణిజ్య దృక్పథంతోనే ూండకండి. ప్రాథమిక దశలోనే కచ్చేరీలు ఇచ్చేయాలని ఆత్రపడకండి. శ్రద్ధాసక్తులతో నిరంతరం సంగీతం నేర్చుకుంటూ ూంటే, డబ్బు, కీర్తి ప్రతిష్ఠలు వాటంతట అవే వస్తాయి’’ అంటూ యువ సంగీత కళాకారులకు విలువైన సందేశమిచ్చిన నూకల మృతితో కర్ణాటక సంగీత ప్రపంచం ఓ అమూల్య సంగీత రత్నాన్ని కోల్పోయింది. ముఖ్యంగా, మన కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన విద్వాంసుల్లో మరో ముఖ్యుడు దూరమవడం తెలుగ్నువారికి తీరని లోటు!
....................................................................

3 వ్యాఖ్యలు:

విన్నకోట నరసింహా రావు said...


చాలా సంతాప వార్త. సంగీతలోకానికి పెద్ద దిక్కుల్లో ఒకరు. ఇటీవలే పినాకపాణి గారు, ఇప్పుడు నూకల వారు గతించటం సంగీతాభిమానులకు పెద్ద షాక్.

Anonymous said...

ఆ తరం వాళ్ళు ఒక్కొక్కరిగా రాలిపోతున్నారు.వారి వారసత్వాన్ని కొనసాగించగల సమర్ధత కొరవడుతోంది.

Unknown said...

నా ఇష్టపది నూకల చిన సత్యనారాయణగారి కన్నుమూత కర్ణాటక సంగీతానికి గుండెకోత!ఏమి గాత్రం!ఏమి సేవ!ఏమి శిష్య వాత్సల్యం!ఏమి మనీషి!సార్థక జీవనులు!వారి కుటుంబ సభ్యులకు ఇదే నా సహానుభూతి!మరో తాజమహల్ నిర్మించినప్పుడు మరో నూకల చిన సత్యనారాయణ పుడతారు!