జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Sunday, October 4, 2015

అక్టోబర్ 9నే 'రుద్రమదేవి'


అక్టోబర్ 9నే రుద్రమదేవి










తెలుగు సినిమా చరిత్రలో మరొక 
ప్రతిష్ఠాత్మక ప్రయత్నం జనం 
ముందుకు రావడానికి అన్ని 
విధాలా రంగం సిద్ధమైంది. మన
 తెలుగు జాతి చరిత్రకు అద్దం 
పట్టే కాకతీయ సామ్రాజ్య 
విజయగాథ ‘రుద్రమదేవి’ సరిగ్గా 
మరో 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా
 అలరించనుంది. దర్శక - నిర్మాత 
గుణశేఖర్ దాదాపు మూడేళ్ళుగా 
చేస్తున్న ఈ భారీ చిత్రం అక్టోబర్ 9న రిలీజవడం 
కన్‌ఫర్‌‌మ అయింది. అటు 3డీలో, ఇటు
 రెగ్యులర్ 2డీలో - రెండు రూపాల్లోనూ ఈ చారిత్రక 
కథా స్వప్నం దేశవిదేశాల్లో తెరపై 
కనిపించనుంది. అగ్ర కథానాయిక అనుష్క ప్రాణం 
పెట్టి, ప్రధాన పాత్ర పోషించగా, 
గుణశేఖర్ తన సర్వశక్తులూ ఒడ్డి చేసిన వెండితెర 
యజ్ఞం - ‘రుద్రమదేవి’ గురించే 
ఇప్పుడందరి డిస్కషన్.

నాలుగు భాషల్లో... అదే డేట్‌లో...

ఈ సినిమా రిలీజ్ టైవ్‌ు గురించి ఇటీవల వ్యక్తమవుతున్న
 అనుమా నాలు,
 అసత్య ప్రచారాల నేపథ్యంలో అసలు నిజం కనుగొనేందుకు
 ‘సాక్షి’ ప్రయత్నించింది.
 వివిధ వర్గాలతో మాట్లాడింది. ‘‘సంక్లిష్టమైన 3డీ టెక్నాలజీ
 సినిమా కావడం,
తెరపై అడుగడుగుకీ ఉన్న విజువల్ ఎఫెక్ట్స్ కారణంగా
నిర్మాణంలోనూ, నిర్మాణానంతర
కార్యక్రమా ల్లోనూ ఈ భారీ చిత్రం ఆలస్యమైంది. తప్పనిసరి
పరిస్థితుల్లో గతంలో కొన్నిసార్లు రిలీజ్ వాయిదా పడింది.
దాంతో, రిలీజ్ డేట్ గురించి కొందరు
అనుమానంగా మాట్లాడుతున్నారు. కానీ, సినిమా వర్క్
మొత్తం పూర్తయిపోయింది.
ఇప్పటికే సెన్సార్ కూడా అయిపోయింది. అక్టోబర్ 9న
తెలుగు, తమిళ, మలయాళ,
 హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ‘రుద్రమదేవి’ రిలీజ్
 అవుతోంది’’ అని చిత్ర
యూనిట్ వర్గాలు ‘సాక్షి’కి స్పష్టం చేశాయి.

ప్యాచ్ వర్‌‌కకీ... ఫారిన్ మ్యుజీషియన్‌‌
 ఆంతరంగిక వర్గాల ప్రకారం - ఈ సినిమాకు వివిధ ప్రాంతాల
నుంచి రావాల్సిన
విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ ఇప్పటికే వచ్చేశాయి. వాటన్నిటి 3డీ
కన్వర్షన్ శరవేగంతో
జరిగిపోతోంది. తెరపై దృశ్యాల్ని మరింత అందంగా,
ఆకర్షణీయంగా మార్చే
‘డిజిటల్ ఇంటర్మీడియట్’ (డి.ఐ) వర్‌‌కతో ముంబయ్‌లో
 సినిమాకు
 మెరుగులు దిద్దుతున్నారు.

విశేషం ఏమిటంటే, ఈ సెల్యులాయిడ్ శిల్పాన్ని ఆడియన్‌‌సకు
కన్నుల పండుగగా మలచడానికి ఉన్న ఏ చిన్న అవకాశాన్నీ
గుణశేఖర్ వదిలి పెట్టడం లేదు. ఈ చిత్రం రీరికార్డింగ్‌ను విదేశాల్లో
జరిపారు. ఇటీవలే ఈ చిత్రంలో ఒకటి రెండు చోట్ల రీరికార్డింగ్‌లో
కొత్తగా ప్యాచ్‌వర్‌‌క చేస్తే బాగుంటుందని ఆయన, సంగీత దర్శకుడు
ఇళయరాజా భావించారు. అంతే, ఖర్చుకు వెనుకాడకుండా హంగేరీ
 నుంచి
డజను మంది మ్యుజీషి యన్‌‌సను మళ్ళీ ప్రత్యేకంగా ఇండియాకు
 పిలిపించారు.
వాళ్ళతో నాలు గైదు రోజుల పాటు శ్రమించి, ఆ దృశ్యాలకు కొత్త
 సొబగులు కూర్చారు.

సక్సెస్‌ఫుల్... చారిత్రక ఫార్ములా
అల్లు అర్జున్ (గోన గన్నారెడ్డి), రానా (రుద్రమదేవి భర్త చాళుక్య
వీరభద్రుడు) లాంటి ఎందరో స్టార్‌‌స నటించిన ఈ చిత్రానికి
 చాలానే ప్రత్యేకతలున్నాయి. దాదాపు రూ. 70
కోట్ల పైగా ఖర్చుతో రూపొందిన హీరోయిన్ ఓరియంటెడ్
కథా చిత్రం ఇది. మలయాళ, తమిళ, కన్నడ, మరాఠా
 నేలల దాకా తెలుగువారి అధికారాన్ని విస్తరించి, మన ఖ్యాతిని
దక్షిణ భారతదేశమంతటా వ్యాప్తి చేసిన కాకతీయ సామ్రాజ్యపు
కథకు తొలిసారిగా వెండితెర రూపం ఇది. ఎన్టీఆర్ ‘సమ్రాట్
అశోక’ (1992) తరువాత 23 ఏళ్ళకు తెలుగులో భారీ
తారాగణంతో వస్తున్న చారిత్రక కథా చిత్రం కూడా ఇదే.
గతంలో తెలుగులో వచ్చిన ‘పల్నాటి యుద్ధం’, ‘బొబ్బిలి
యుద్ధం’, ‘తెనాలి రామకృష్ణ’, ‘మహామంత్రి తిమ్మరసు’,
‘అల్లూరి సీతారామరాజు’ లాంటి చారిత్రక కథాచిత్రాల్లో
నూటికి 95 శాతం హిట్లే. ఆ కోవలోనే ఈ సినిమానూ
 పకడ్బందీగా తీర్చిదిద్దారు.

టాప్ క్లాస్ టెక్నీషియన్ల శ్రమ
టెక్నికల్ అంశాల్లో కూడా ఈ సినిమా వెనుక చాలా
శ్రమే ఉంది. భారతదేశపు తొలి హిస్టారికల్ స్టీరియో
స్కోపిక్ 3డీ ఫిల్మ్. ఈ  3డీ చిత్ర నిర్మాణం కోసం
గుణశేఖర్ ఏకంగా విదేశాలకు వెళ్ళి, ప్రత్యేకంగా
3డీ ఫిల్మ్ మేకింగ్ కోర్‌‌స కూడా చేసి వచ్చారు.
ఇన్నేళ్ళ తన అనుభవాన్ని ఈ సినిమా కోసం
వినియోగించారు. చిన్నప్పుడు చదివిన వీరనారి
 ‘రుద్రమదేవి’ కథను తెరకెక్కించాలన్న గుణశేఖర్
చిరకాల స్వప్నాన్ని నిజం చేయడానికి కృషి
చేసిన ఇళయరాజా (మ్యూజిక్), తోట తరణి
 (ఆర్‌‌ట డెరైక్టర్), శ్రీకర్ ప్రసాద్
 (ఎడిటింగ్), ‘జోధా అక్బర్’ ఫేవ్‌ు నీతా లుల్లా
 (కాస్ట్యూవ్‌ు్స) అందరూ
జాతీయ అవార్డు విజేతలైన సినీ సాంకేతిక
నిపుణులే కావడం మరో విశేషం.
చారిత్రక కథతో చేస్తున్న ఈ సినిమాలో తండ్రీ
 కూతుళ్ళ మధ్య అనుబంధం
లాంటి ఎమోషన్లూ చాలా ఉన్నాయి. ఇన్ని
విశేషాలున్న ఈ చిత్రం కోసం...
లెటజ్ వెయిట్ ఫర్... అక్టోబర్ 9.

.............................................

0 వ్యాఖ్యలు: